వరుడు కావలెను…ట్రైలర్

414
Varudu kavalenu
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌, టీజర్‌కు మంచి స్పందనరాగా సాంగ్‌కు అయితే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 29న సినిమా విడుదల కానుండగా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకుంది.

ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. తాజాగా సినిమా ట్రైలర్‌ను గురువారం రానా దగ్గుబాటి విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే యూత్‌ఫుల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఆకాష్ పాత్రలో నాగశౌర్య, భూమి పాత్రలో రీతూ వర్మ కనిపించారు.

- Advertisement -