Amith Shah:ఢిల్లీకి ఏటీఎంగా కాంగ్రెస్

9
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌పై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారని ఆరోపించారు.సిద్ధిపేటలో బీజేపీ విశాఖ జనసభలో మాట్లాడిన షా..దేశం వ్యాప్తంగా ఉన్న జఠిలమైన సమస్యలకు కూడా తన ప్రభుత్వం పరిష్కరించిందని పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా ఎన్నికల ఫండ్ అంతా తెలంగాణ నుంచి వెళ్తోందని ఆరోపించారు. మరోసారి మోడీ ప్రధాని అయితే తెలంగాణలో అవినీతి అనేది లేకుండా చేస్తామని అన్నారు. తాము అధికారంలోకి రాగనే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేస్తామని అన్నారు.

500 ఏళ్ల తరువాత అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేపట్టామని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో ఏళ్లుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370ని రద్దు చేశామని అన్నారు. అయోధ్య లో రామమందిరం నిర్మాణం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని.. అందుకే నిర్మాణం చేయకుండా కేసులు వేసిందన్నారు.

- Advertisement -