యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించిన కాంగ్రెస్…

173
inc
- Advertisement -

అంబేద్కర్ జయంతి సందర్భంగా యూ ట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ ఖర్గే, ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు నీరజ్ కుందన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

తొలి షోగా భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో జర్నలిస్టుగా మహాత్మా గాంధీ పాత్రపై ఒక లఘు చిత్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ప్రసారం చేసింది.ప్రతి రోజు సుమారు 8 గంటలపాటు ప్రత్యక్ష కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. చాలా ఏండ్లుగా ప్రధాన స్రవంతి మీడియా పక్షపాతంతో, ప్రతిపక్షానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

ఈ నెల 24న జాతీయ పంచాయతీ రాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని లైవ్‌ కార్యక్రమాలను ప్రసారం చేస్తామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు.

- Advertisement -