త్వరలో కొత్త రేషన్ కార్డులు: కేటీఆర్

125
ktr
- Advertisement -

త్వరలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు కేటీఆర్. ఈ సందర్బంగా మాట్లాడిన కేటీఆర్……కేంద్రంపై ఒత్తిడి తేవాలని 2008లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎమ్మెల్యే పదవికి లక్ష్మారెడ్డి రాజీనామా చేశారని గుర్తుచేశారు.

రాష్ట్రంలో 40 లక్షల మందికి పెన్షన్లిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ది చెందుతోందని …తెలంగాణ రాక మునుపు, తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకోవాలన్నారు.

జడ్చర్ల తొలి మున్సిపల్ ఎన్నికల్లో 27 వార్డులను గెలుపును కానుకగా ఇవ్వండి, అభివృద్దిని చేసి చూపిస్తామని కోరారు కేటీఆర్. గతంలో ఏప్రిల్ , మే నెలల్లో కరెంటు కోతలుండేవి… ఇపుడు 24 గంటల కరెంటుస్తున్నామని పేర్కొన్నారు.

- Advertisement -