KCR:అచ్చెదిన్ కాదు సచ్చెదిన్?

12
- Advertisement -

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర 3 రోజు పూర్తయింది. మహబూబ్‌నగర్‌కు చేరుకున్న కేసీఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. కేసీఆర్ రోడ్‌ షోకు వచ్చిన ప్రజలతో మహూబూబ్‌నగర్ మొత్తం గులాబీ మయమైంది. పార్లమెంటు ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీలో వున్నాయి. వీటిలో ఏ పార్టీ మనకు మేలు చేస్తదో ఆలోచన చేయాలన్నారు కేసీఆర్. బీజేపీ పార్టీ మనకేమన్నా మేలు చేసిందా ఈ పదేండ్ల సంది .?,మోడీ వంద నినాదాలు చెప్పిండు ఒక్కటన్న నిజమైందా ?,సబ్కా వికాస్ అన్నడు కానీ సత్యనాశ్ చేసిండు అని మండిపడ్డారు.

అచ్చేదిన్ వచ్చిందా సచ్చేదిన్ వచ్చిందా .?,నీను గెలిస్తే 15 లక్షలు మీ బ్యాంకుల వస్తాయన్నాడు వచ్చినయా.?,నరేంద్ర మోడీ విశ్వగురువు ఎట్లాయే.?,పాలమూరు ఎత్తి పోతలక్ కోసం వంద ఉత్తరాలు రాసినం జాతీయ హోదా ఇచ్చిండా..?,లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి నింపిండా..?,రైతులకు నల్ల చట్టాలు తెచ్చిండు వందలాది రైతుల మరణాలకు కారణమైండు అని దుయ్యబట్టారు.

తెలంగాణకు ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలేదు,ఈడ చోటే బాయి కి ఓటేసినా ఆడ బడే బాయికి ఓటేసినా ఒకటే..,ఏడు మండలాలను ఆంధ్రన్లోకలిపిన మోడీ కి ఎందుకెయాలే ఓటు,బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం అన్నారు.ఆంధ్రాకు నీళ్లు మలుపుక పొమ్మని హారతులు పట్టిన డీకే అరుణకు ఓటెందుకెయ్యాలే ..?,మాకు ఓటేస్తే నిమిషాల మీద యిదిస్తాం అదిస్తాం అన్నది కాంగ్రెస్ పార్టీ… ఐదునెళ్లు కావస్తాందన్నారు.

రైతు బందు వచ్చిందా?,రుణ మాఫీ అయ్యిందా?,పంటలకు బోనస్ వచ్చిందా?,స్కూటీ ఇయ్యలేదు గానీ లూటీ అయితే నడుస్తాందన్నారు.తులం బంగారం ఇస్తామన్నారు ఇచ్చిండ్రా .?,ఆసరా పింఛను పెంచిండ్రా?,ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ లేదు, ప్రతి విషయం లో ప్రతి స్కీమ్ లో మోసం దగా అని దుయ్యబట్టారు.బిఆర్ఎస్ సెక్యులర్ పార్టీ దీన్ని గెలిపించాలని ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ గెలిస్తే ఎంతో నష్టం జరుగుతుంది,బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే,వీళ్లు ఇద్దరు కలిసి భువనగిరి లో బిఆర్ఎస్ ను దెబ్బతీశాయన్నారు. సీఎం స్థాయిలోక్ ఉండి పెగులుపీకుతా, ముడ్డి మీది షెడ్డి గుంజుతా జైళ్ల ఎస్తా అంటండు ఇది పద్దతేనా.? ఆలోచించాలన్నారు. బిఆర్ఎస్ కు మీరిచ్చే శక్తి మీ శక్తే..బిఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:Revanth:BJP..బ్రిటిష్ జనతా పార్టీ

- Advertisement -