గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి..

146
palla
- Advertisement -

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో టి ఆర్ యస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ వేయనున్న సందర్బంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని నల్గొండ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.

ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు సుఖేందర్ రెడ్డి.ఈ కార్యక్రమంలో నల్గొండ జడ్పి చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్సీ తెర చిన్నపరెడ్డి ,మాజీ ఎమ్మెల్యే విజయసింహ రెడ్డి , మదర్ డైరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ,తదితరులు పాల్గొని, పల్లా రాజేశ్వర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -