కేసీఆరే మళ్లీ రావాలి..హ్యాట్రిక్ సీఎం కావాలి

29
- Advertisement -

మళ్లీ కేసీఆర్ రావాలని, మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని నమ్మకం వ్యక్తంచేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన..ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కేసీఆర్‎నే నమ్ముతారని స్పష్టం చేశారు.

కొన్ని కారణాల వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు తనతో విడిపోవచ్చని, అయినా వారి విజయాన్నే కోరుకుంటున్నాని చెప్పారు. ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్‌ పార్టీ పని అని …మేడిగడ్డ బ్యారేజీ అంశంలో కూడా జరుగుతున్నదని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల సమస్యలపై అబాండాలు సరికాదన్నారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని తెలిపారు. కేసీఆర్‌ విజయం కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తనకు అభిమానులు, మిత్రులు ఉన్నారని వారంతా కారుకే ఓటు వేయాలన్నారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను కానీ, తన కుమారుడు కానీ పోటీ చేస్తామన్నారు.

Also Read:ప్చ్.. మహేష్ సినిమా పై నెగెటివిటీ

- Advertisement -