అద్భుతంగా ముందుకు సాగుతున్న గ్రీన్ ఛాలెంజ్..

199
Green India Challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బోయినపల్లి మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపెల్లి లక్ష్మి రాములు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ నల్లగొండ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బాగంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. మా కమిటీ చైర్మన్ లక్ష్మి రాములు నాకు ఛాలెంజ్ విసిరారు అందులో భాగంగా ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలలు తెలుపుతున్నాను అని అనిల్‌ తెలిపారు.

- Advertisement -