మే 27న‌ వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక..

7
- Advertisement -

పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన వ‌రంగ‌ల్ – ఖ‌మ్మం – న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. మే 2న నోటీఫికేషన్ జారీ కానుండగా మే 2 నుంచి 9వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు.

10వ తేదీన నామినేష‌న్ల‌ ప‌రిశీలిన,ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ మే 13. ఈ ఉప ఎన్నిక‌కు మే 27వ తేదీన పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు.27న ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు.

Also Read:కాంగ్రెస్ పాలనలో ఒక్క వర్గమైన బాగుపడిందా?

- Advertisement -