పౌష్టికాహార లోపమా..అయితే జాగ్రత్త!

500
- Advertisement -

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అనేక రకాల హెల్త్ టిప్స్ పాటించడం ఎంతో ముఖ్యం. అయితే మనకు పోషకాహార లోపంతోనే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. సరైన పోషకాలు ఉన్న పదార్థాలను తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడి మనిషి రోగాల బారీన పడే అవకాశం ఉంటుంది. అయితే సరైన విటమిన్లతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలను మనం సులభంగా నయం చేసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

1. కంటి చూపు సమస్య
కంటి చూపు మెరుగు పడేందుకు టమాట, అల్లం, వెల్లుల్లి, క్యాప్సికం, నిమ్మకాయ, పాలకూర, ఉల్లిగడ్డ తదితర ఆహారపదార్థాల ద్వారా మనకు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. శారీర రోగ నిరోధక శక్తి పెరగాలన్నా.. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

2. చర్మ సమస్య
ఈ సమస్యతో బాధపడేవారు విటమిన్ ఎ,సి, ఇ ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఇవి ఎండ వల్ల కందిన చర్మాన్ని సంరక్షించడమే కాక.. ఇతర కారణాల వల్లే చర్మ సమస్యలను తగ్గిస్తాయి. నట్స్, క్యారెట్లు, కోడిగుడ్లు, నిమ్మకాయ, కివీలు, ద్రాక్ష, డ్రైయ్ ఫ్రూట్స్ తదితర పదార్థాలను తీసుకోవాలని సూచించారు.

3. దంతాల సమస్య
దంతాలు, ఎముకల సమస్యలతో బాధపడేవారు విటమిన్ డి, కాల్షియం ఉన్న ఆహార పదార్థాలతో పాటు ట్యాబ్లెట్లను కూడా వాడాలని చెప్తున్నారు. రాజ్మా, పాలు, సోయా, పాలకూర, పెరుగు, సోయా తదితర ఆహార పధార్థాల్లో ఇవి విరివిగా లభిస్తాయి.

4. జీర్ణ సమస్య
తీసుకున్న ఆహారం జీర్ణం కావడం లేదని బాధపడేవారు ప్రొబయోటిక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలని వైద్య నిపుణులు వెల్లడించారు. పాలు, వెల్లుల్లి, బాదం పప్పు, అరటి, యాపిల్స్ తదితర ఆహార పదార్థాల్లో ఇవి అధికంగా లభిస్తాయి.

 Also Read:పార్టీకో ‘వ్యూహ’కర్త సిద్ధం !

- Advertisement -