- Advertisement -
మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిపట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. నాయిని మృతి చెందిన వారం రోజుల్లోనే ఆయన భార్య మృతిచెందడం అందరిని విషాదంలోకి నెట్టింది.
నాయిని నర్సింహారెడ్డి రెడ్డి సతీమణి అహల్య ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.సంతాపం తెలిపిన వారిలో కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్, ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు, సత్యవతి రాథోడ్, పలువురు ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఉన్నారు.
- Advertisement -