- Advertisement -
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా పల్లెలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. కొత్త పంచాయతీ రాజ్ తెచ్చిన చట్టం, సీఎం కేసీఆర్ ముందుచూపుతో పల్లెల రూపు రేఖలు మారాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణలో పల్లెలు ప్రకృతి వనాలుగా మారాయని ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. ప్రకృతి వనాలు పల్లెలకు కొత్త అందాలను అద్దుతున్నాయని….కొత్త పంచాయతీ రాజ్ చట్టం తెచ్చిన మార్పులతో తెలంగాణ పల్లెల్లో గ్రీన్ కవర్ ఆకు పచ్చదనం పరుచుకుంటుందని ట్విట్టర్లో పేర్కొన్నారు కేటీఆర్.
- Advertisement -