మంత్రి ఎర్రబెల్లి పీఏ,గన్‌మెన్‌లకు కరోనా

189
errabelli
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53 వేలకు చేరవయ్యాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు కరోనా బారీన పడగా తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏ,గన్‌మెన్‌లకు కరోనా సోకింది.

ఈ నెల 21న వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మంత్రి స్వగృహంలో ఆయన వెంట ఉన్న పీఏలు, గన్‌మన్లు, సహాయకులు మొత్తం 40 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో ఆరుగురికి పాజిటివ్‌ అని తేలింది. వీరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలో ఇప్పటివరకు 3,37,771 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ప్రస్తుతం 11,677 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఇప్పటివరకు 455 మంది మృతి చెందారు.

- Advertisement -