మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు‌ కరోనా..

123
koppula
- Advertisement -

తెలంగాణలో తాజాగా మరో మంత్రికి కరోనా సోకింది. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కరోనా బారినపడ్డారు. కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలినట్లు ఆయన తెలిపారు. నేను ఈ రోజు కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్ రావడం జరిగింది. ఈ మధ్యలో నన్ను కలవడానికి వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు గాని లక్షణాలు ఉన్నచో వారు కూడా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -