రెండో వన్డేలో భారత్ ఘనవిజయం..

107
ind
- Advertisement -

శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ అద్భుత విజయం సాధించింది. ఓటమి తప్పదనుకున్న తరుణంలో దీపక్ చాహర్ చేసిన మ్యాజిక్‌తో భారత్‌ గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది. లంక విధించిన 276 పరుగుల లక్ష్యాన్ని 49.1 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి చేధించింది.

భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పృథ్వీ షా (13), ఇషాన్‌ కిషన్‌ (1), శిఖర్‌ ధావన్‌ (29; 6 ఫోర్లు) త్వరగా పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను పాండే, సూర్యకుమార్‌ తీసుకున్నారు. అయితే మనీశ్‌ పాండేను (31 బంతుల్లో 37) చేసి పెవిలియన్ బాటపట్టగా హార్దిక్‌ (0) కూడా విఫలమయ్యాడు. కృనాల్‌ (35), సూర్యకుమార్‌ హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దీపక్‌ చహర్‌ (82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌ కు తోడుగా సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్‌ (3/50), భువనేశ్వర్‌ (3/54), దీపక్‌ చహర్‌ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.

- Advertisement -