భారత్ విక్టరీపై ఆనంద్ మహీంద్రా

36
- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంకను చిత్తు చేసింది భారత్. లంకతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదుచేసింది. దాదాపు 302 పరుగుల తేడా శ్రీలంకు చిత్తు చేయగా భారత బౌలర్ల ముందు లంక బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. దాదాపు ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్‌ అయ్యారంటే భారత బౌలర్లు ఏ మేరకు విజృంభించారో అర్ధం చేసుకోవచ్చు.

భారత విజయంపై స్పందించారు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. భారత బౌలర్లు శ్రీలంకను భయబ్రాంతులకు గురిచేశారు. వెస్టిండీస్ టీం ఉచ్ఛస్థితిలో ఉన్న రోజుల్లోనూ వారి బౌలర్లు ప్రత్యర్థి టీం వికెట్లు ఈ రీతిలో కూల్చారని నేను అనుకోను. మనోళ్లు నిజంగా శ్రీలంకకు భయానకవాతావరణం సృష్టించారు. మ్యాచ్ ముగియడంతో శ్రీలంక ఇక్కట్లు తీరినందుకు నేనైతే సంతోషించా అని చెప్పారు. ప్రస్తుతం మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Also Read:Jagadish Reddy:పేదలకు భరోసా బీఆర్ఎస్

- Advertisement -