ఉమెన్స్ డే..గ్రీన్ ఇండియా పోస్టర్ ఆవిష్కరణ

55
- Advertisement -

ఉమెన్స్ డే సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ఫౌండర్‌, బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్‌ ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ విశేష ఆదరణ పొందింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటి వాటి ఆవశ్యకతను ప్రజలకు సవివరంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ…పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే..ప్రకృతి పరవశించిపోతుందని అన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ జాగ్రత్త అద్భుతమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి8వ తేదీని పురస్కరించుకొని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…స్త్రీలు శక్తిస్వరూపమని, వారు తలపెట్టిన అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయగలరని అని అన్నారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఉమెన్స్ డే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి మహిళలు విద్యార్థినిలు పాల్గొనేలా తనవంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ…సృష్టికి మూలం స్త్రీమూర్తి అని మహిళలంతా ప్రకృతి పరిరక్షణ కోసం…గ్రీన్ ఇండియా కార్యాక్రమంలో పాల్గొనాలన్నారు. మహిళా ఉద్యోగులంతా విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ మాట్లాడుతూ…మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూనే పుడమి బాగుకోసం అలుపెరగక కృషి చేయాలన్నారు. సాలుమారద తిమ్మక్క స్పూర్తితో ప్రతి మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.

సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్‌ మాట్లాడుతూ…తరువాతి తరాల బాగుకోసం తలపెట్టిన నిస్వార్ధమైన కార్యక్రమమన్నారు. ఒక మంచి ఆశయంతో పనిచేస్తున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి మహిళా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి..

గ్రీన్‌ ఇండియా…మొక్కలు నాటిన హోంమంత్రి

హెకానీ జఖాలు..నాగా చరిత్రలో తొలి మహిళ ఎమ్మెల్యే

జగనన్న పథకాలకు.. టీడీపీ బ్రేక్!

- Advertisement -