టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు సంప్రదాయ భోజనం..

267
ttd
- Advertisement -

శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ‘సంప్రదాయ భోజనం’ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈరోజు నుండి గోఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టింది. అంతేకాదు త్వరలో పలుప్రాంతాల్లో భక్తులకు ఈ సాంప్రదాయ భోజనం అందుబాటులోకి రానున్నదని టీటీడీ అధికారులు తెలిపారు.

ఆహార పదార్థాలు ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు సమానమైన ధరకే భక్తులకు అందజేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం అన్నమయ్య భవన్‌లో గోఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం ఏడుకొండలపైకి వచ్చిన భక్తుల నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్న హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి భక్తులకు విముక్తి లభించనుంది.

- Advertisement -