టాటా సఫారీ న్యూ వేరియంట్‌.. బుకింగ్స్‌ ప్రారంభం

217
safari
- Advertisement -

అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న టాటా సఫారీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మొత్తం ఆరు వేరియంట్లలో టాటా సఫారీ 2021 యూఎస్‌వీ కార్లను లాంచ్‌ చేయగా బేసిక్ మోడల్ ధరను 14.69 లక్షలుగా నిర్ణియించింది. టాప్ ఎండ్ మోడల్ ఖరీదు 21.45 లక్షలుగా ఉంది.

సంబంధిత డీలర్స్‌ వద్ద రూ. 30 వేలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఎ‍క్స్‌ఈ, ఎఎక్స్‌ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌టీ ప్లస్‌, ఎక్స్‌జెడ్‌, ఎక్స్‌జెడ్‌ ప్లస్‌ అనే మోడళ్లలో టాటా సఫారీ అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అడ్వెంచర్ పర్సోనా పేరుతో కొత్త వేరియంట్‌ను కూడా రిలీజ్ చేసింది .దీని విలువ 20.20 లక్షలు (ఎక్స్-షోరూమ్‌న్యూఢిల్లీ) గా ఉండనుంది.

- Advertisement -