ప్రజలకు మరింత చేరువలో విజయ డెయిరీ: తలసాని

267
talasani srinivas
- Advertisement -

విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ లాలాపేటలోని విజయ డైరీ ప్రధాన కార్యాలయంలో బ్యాటరీతో నడిచే 15 వాహనాలను పంపిణీ చేశారు మంత్రి తలసాని.

ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని…విజయ బ్రాండ్ ఉత్పత్తుల కు విశేష ప్రజాదరణ ఉందన్నారు. విజయ డెయిరీ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని వెల్లడించారు.

ప్రజలకు మరింత చేరువ చేసేందుకు మరిన్ని ఔట్ లెట్ ల ఏర్పాటు చేస్తున్నాం అని…ప్రైవేట్ డెయిరీలకు దీటుగా విజయ డెయిరీని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామన్నారు తలసాని. నగరంలో 100 బ్యాటరీతో నడిచే మొబైల్ ఔట్ లెట్ ల ద్వారా విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయని దేశంలోనే విజయ డెయిరీ అగ్రస్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు.

- Advertisement -