కన్నులపండువగా లాల్‌దర్వాజ బోనాలు..

56
- Advertisement -

భాగ్యనగరం బోనమెత్తింది. బోనాల పండుగతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది.

చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు. మహంకాళిని దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో లైన్లలో వేచిఉన్నారు.

Also Read:బోడ కాకరకాయలు తింటే.. ఎన్నో రోగాలు దూరం!

- Advertisement -