Talasani:కాంగ్రెస్‌ని నమ్మి మోసపోవద్దు

58
- Advertisement -

కాంగ్రెస్‌ని నమ్మి మోసపోవద్దన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గురువారం సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర సంవత్సరాలలో చేసి చూపెట్టామన్నారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాభై ఏండ్లు అధికారంలో ఉండి ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ప్రజలు గుర్తుకొస్తారని మండిపడ్డారు.బీఆర్‌ఎస్‌ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలన్నారు.

ప్రజల కష్టాల సుఖాల్లో పాలు పంచుకోని కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఎన్నికల సమయంలో మాయమాటలతో మన మధ్యకు వస్తున్నారు. అలాంటి వారి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.

Also Read:ఓటీటీలోకి మాన్షన్ 24!

- Advertisement -