మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డిజిల్ ధ‌ర‌లు

214
Petrol Price
- Advertisement -

దేశంలో గ‌త 14 రోజుల నుంచి పెట్రోల్, డిజిల్ ధ‌ర‌లు పెరుగుతూ వ‌స్తున్నాయి. దేశ వ్యాప్తంగా క‌రోనాతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే పెట్రోల్ రేట్లు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా దేశీయ పెట్రోలియం కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 51 పైసలు, డీజిల్‌పై 61 పైసలు పెంచాయి.

దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.78.88కి, డీజిల్‌ ధర రూ.77.67కి చేరాయి. ఈ పెంపుతో దేశంలో పెట్రో, డీజిల్‌ ధరలు 19 నెలల గరిష్టానికి చేరాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం ముడి చమురు ధరలు తగ్గిన మ‌న దేశంలో పెట్రోల్ , డిజిల్ ‌రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

- Advertisement -