ఎమ్మెల్యే రాజాసింగ్ గ‌న్ మెన్ కు క‌రోనా పాజిటివ్

217
- Advertisement -

తెలంగాణ‌లో కరోనా వైర‌స్ వేగంగా విస్త‌రిస్తుంది. ఒక్క హైద‌రాబాద్ లోనే వంద‌ల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. సామాన్యులు, ప్ర‌జా ప్ర‌తినిధులు అంటూ తేడా లేకుండా అంద‌రూ క‌రోనా భారిన ప‌డుతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గ‌న్ మెన్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. ఆ గ‌న్ మెన్ గ‌త రెండు రోజుల నుంచి రాజాసింగ్ తో పాటు కారులో ప్ర‌యాణించారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ వెంట‌నే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లి పోయారు.

కాగా రాష్ట్రంలో ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డితో పాటు ఆయ‌న భార్య‌, కారుడ్రైవ‌ర్ , గన్ మెన్ కు క‌రోనా సోక‌గా, మ‌రో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ రెడ్డి గ‌న్ మెన్ కు కూడా పాజిటివ్ వ‌చ్చింది. ప్ర‌జాప్రతినిధుల‌కు క‌రోనా సోకుతుండ‌టంతో చాలా మంది సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు.‌‌

- Advertisement -