పెట్రోల్ ధరల తగ్గింపు పేరుతో మోసం..?: కేటీఆర్

64
ktr
- Advertisement -

పెట్రోల్ ధరల తగ్గింపుపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ముందు అసలు ధరలు పెంచింది ఎవరు.. ఇప్పుడు తగ్గింపు పేరుతో ప్రజలను మోసం చేస్తుంది ఎవరూ అంటూ ప్రశ్నించారు. నా పాఠశాల పక్కన ఉన్న ఓ దుకాణాదారుడు పీక్‌ సీజన్‌లో ధరలను 300శాతం పెంచి.. ఆపై ప్రజలను మోసం చేయడానికి దానిని 30శాతం తగ్గించే వాడని తెలిపారు.

అతని సన్నిహితులు దాన్ని బంఫర్‌ ఆఫర్‌గా అభివర్ణిస్తూ.. అతనికి ధన్యవావాలు తెలిపేవారు. ఇది ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందా…? ముందు అసలు ధరలు పెంచింది ఎవరు..?’ అని ట్వీట్‌ చేశారు.

- Advertisement -