Pawan:తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

36
- Advertisement -

ఏపీ వైసీపీ నాయకులపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలంగాణ ప్రజల విషయలో ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు పవన్. తెలంగాణ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు, కౌంటర్లు హద్దులు దాటుతున్నాయని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు పరిధి దాటకూడదని..ప్రజలు వేరు – రాజకీయ నేతలు వేరని.. రాజకీయ నేతలను తిడితే తెలంగాణ సమాజాన్ని.. ప్రజలను తిట్టటం ఏంటని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలను తిట్టటం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాట్లాడటం వ్యక్తిగతంగా చాలా ఆవేదన కలిగించిందన్నారు. ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజలను లాగొద్దన్నారు. ప్రజలను – పాలకులను కలిపి చూడొద్దని.. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -