మోసగాళ్లు…సునీల్ శెట్టి టీజర్

199
mosagallu
- Advertisement -

మంచు విష్ణు హీరోగా హాలీవుడ్-ఇండియన్ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని చేధించే కథాంశంతో ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి టాలీవుడ్ కు పరిచయం అవుతున్న ఈ చిత్రంలో రుహీ సింగ్ – నవదీప్ – నవీన్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

దీపావళి కానుకగా సినిమా నుండి మరో టీజర్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల కానుంది.

https://youtu.be/mFcAVut6ylQ
- Advertisement -