మొక్కలు నాటిన ఐ ఏ ఎస్ ఉదయ్ కుమార్

174
ramagundam
- Advertisement -

రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ జితేష్ పాటిల్ విసిరినా ఛాలెంజ్ స్వీకరించి ఈరోజు తన అధికార నివాసం లో మొక్కలు నాటిన ఉదయ్ కుమార్ ఐఏఎస్.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు . గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కి మద్దతుగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజవంతంగా కొనసాగుతుంది . అన్ని వర్గాల ప్రముఖులను భాగస్వామ్యం మొక్కల పెంపకం పైన , వాటిని నాటిన తరువాత ఎదిగె వరకు తీసుకునే బాధ్యతను ప్రజల్లో మంచి అవగాహనా కల్పిస్తున్నారు .

రామగుండము ప్రాంతాల్లో బొగ్గు గనులతో అనునిత్యం ఎండా తీవ్రత ఎక్కువగా ఉంటుంది . ఇక్కడ ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ ని ఛాలెంజ్ తీసుకుకొని ప్రతి ఒక్కరు విధిగా మూడు మొక్కలు నాటి వాటిని ఎదిగే వరకు బాధ్యత తీసుకోవాలని కోరారు . ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మరో ముగ్గురుకి సత్యనారాయణ గారు సిపి రామగుండము , ప్రియాంక అలా అడిషనల్ కమిషనర్ రెవిన్యూ GHMC , సంతోష్ బడవత్ అడిషనల్ కమిషనర్ హెల్త్ GHMC గార్లకి ఛాలెంజ్ చేశారు.

- Advertisement -