మంచు లక్ష్మీ తగ్గిందండోయ్!

20
- Advertisement -

మంచు లక్ష్మీ కొంత కాలం వరకు సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయేది. ముఖ్యంగా ట్రోలర్స్ తో గొడవ పెట్టుకునేది. ముందు ఏదో ఒక కామెంట్ చేసేది. అలాగే కొందరి నెటిజన్ల పై కూడా సెటైర్లు వేసేది. ఆ తర్వాత ట్రోలర్స్ ఆమెను ఓ ఆటాడుకునేవారు. దానికి రివర్స్ గా మంచు లక్ష్మీ కూడా కొంత ఘాటుగానే వారికి రిప్లయ్ ఇచ్చేది. ఐతే, ఇటీవల ట్రోలింగ్ బ్యాచ్ మరింత రెచ్చిపోతున్నారు.

దాంతో, మంచు లక్ష్మీకి మెంటల్ పీస్ పోయింది. మానసిక శాంతి కోసం ఆమె ఇప్పుడు పూర్తిగా తగ్గింది. మునుపటిలా కాంట్రవర్సియల్ స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు. దానికి తోడు, మంచు లక్ష్మికి ఇటీవల పెద్ద హిట్స్ ఏమీ లేవు. ఆమె నటించిన సినిమాలు ఏవీ పెద్దగా రిలీజ్ కావడం లేదు. సో, ఇప్పుడు ఆమెకు భారీ హిట్స్ కావాలి. ఈ లోపు సోషల్ మీడియాకి గ్యాప్ ఇవ్వాలని మంచు లక్ష్మీ నిర్ణయం తీసుకుందట.

పైగా కొత్త ఏడాది 2024లో ఆమె ‘శాంతి ఒప్పందం’ పాటిస్తుందా ?, లేదా ? మళ్ళీ ఏదో రోజు ఎదో విషయంలో కామెంట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ లేపుతుందా ? అనేది చూడాలి. ఇంతకీ, మంచు లక్ష్మి కెరీర్ ట్రాక్ లోకి వస్తోందా ? రాదా ? అనేది చూడాలి. మరోవైపు మంచు లక్ష్మీ పర్సనల్ లైఫ్ లోనూ కొన్ని సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read:NBK:టీడీపీకి బాలయ్యతో ముప్పే?

 

- Advertisement -