తాజ్ మహల్ ప్యాలెస్లో సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులతో పాటు 26/11 ముంబై దాడులలో అమరవీరులను అడివి శేష్ గుర్తు చేసుకున్నారు.’మేజర్’ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్న అడివిశేష్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు హిందీలో భాషలలో రూపొందుతోంది.
ఈ సినిమా హిందీ వెర్షన్కి ప్రామాణికత ఇవ్వడానికి, శేష్ ఈ చిత్రానికి హిందీలో కూడా డబ్బింగ్ చెబుతున్నారు ఇప్పటికే హిందీ వెర్షన్కి డబ్బింగ్ చెప్పడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ రోజు మేజర్ మూవీ హిందీ డబ్బింగ్ మొదలుపెట్టాను..2022ను ఘనంగా ప్రారంభించుదాం“ అని ట్వీట్ చేశారు.
నమ్మశక్యం కాని విన్యాసాలులతో పాటు, సినిమా కోసం పూర్తిగా మేకోవర్ చేసిన నటుడి అంకితభావాన్ని ఇది చూపిస్తుంది.మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బాల్యం, యుక్తవయస్సు, సైన్యంలో చేరిన అద్భుతమైన క్షణాల నుండి అతను అమరవీరులైన ముంబై దాడి యొక్క విషాద సంఘటనల వరకు అతని జీవితంలోని విభిన్న కోణాలను ఈ మేజర్ చిత్రం స్పృశిస్తుంది.
ఇప్పటికే విడుదలైన మేజర్ టీజర్కి విశేషమైన స్పందన వచ్చింది.శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి మరియు మురళీ శర్మ ఇతర ప్రముఖ తారాగణం, ఈ చిత్రం హిందీ, తెలుగు మరియు మలయాళంలో విడుదల కానుంది. మహేష్ బాబు యొక్క GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన మేజర్ చిత్రం ఫిబ్రవరి 11, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.