వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌..ప్రత్యేకతలివే

215
vande bharath express
- Advertisement -

దేశంలో తొలి సెమీ హైస్పీడ్‌ రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించారు. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో కేవలం 18 నెలల్లో ఈ హైస్పీడ్‌ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు.

Image result for vande bharat express specialties

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌..విశేషాలు

()గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
() ఈ రైలులో రెండు ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లతో పాటు 16 ఏసీ కోచ్‌లు
()ఒకేసారి 1128 మంది ప్రయాణీకులు తమ గమ్యస్ధానాలకు చేరుకోవచ్చు
()అన్ని కోచ్‌ల్లో ఆటోమేటిక్‌ డోర్‌లు, జీపీఎస్‌ ఆధారిత సమాచార వ్యవస్థ
()8 గంటల్లో ఢిల్లీ నుండి వారణాసికి ప్రమాణం
()వారణాసి నుంచి ఢిల్లీకి ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో ప్రయాణించేందుకు రూ.3,310, చైర్‌కార్‌లో రూ.1,760 టికెట్‌ ధర
()ఢిల్లీ టూ వారణాసి కేవలం రెండు స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుంది. ఒకటి కాన్పూర్, రెండోది ప్రయాగ్ రాజ్ (అలహాబాద్)
()ఈ ట్రైన్‌లో ప్రయాణించే వారికి ఫైవ్ స్టార్ హోటల్ భోజనం,టీ,టీఫిన్స్‌
() దివ్యాంగులకు ఫ్రెండీ టాయిలెట్స్
()తొలుత ఈ ట్రైన్ పేరు ట్రైన్ 18గా పిలిచే వారు తర్వాత వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా పేరు మార్పు

Image result for vande bharat express specialties

- Advertisement -