Akhilesh:బీజేపీకి ఓటమి తప్పదు

9
- Advertisement -

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్. కన్నౌజ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడిన అఖిలేష్…కోవిడ్ వ్యాక్సిన్ త‌యారీ కంపెనీ నుంచి బీజేపీ కోట్లాది రూపాయ‌లు దండుకుని ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ప్ర‌మాదంలో ప‌డ‌వేసింద‌ని ఆరోపించారు.

ప్ర‌తికూల రాజ‌కీయాలు చేసే వారికి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో భంగ‌పాటు త‌ప్ప‌ద‌ని , క‌న్నౌజ్ ప్ర‌జ‌లు అభివృద్ధి, పురోగ‌తి, సౌభాగ్యానికి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.రాజ‌కీయాల కోసం బీజేపీ ఎంత‌కైనా దిగ‌జారుతుంద‌ని మండిపడ్డారు.

కొవిడ్ స‌మ‌యంలో వ్యాపారుల దందాకు వెసులుబాటు క‌ల్పించిన కాషాయ పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ప‌లు ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని చెప్పారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాషాయ పార్టీని మ‌ట్టుకరిపించి కేంద్రంలో విప‌క్ష ఇండియా కూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

Also Read:BRS:రోజురోజుకు పెరుగుతున్న బీఆర్ఎస్ గ్రాఫ్

- Advertisement -