వెల్‌కమ్ టెస్లా…కండిషన్స్ ఆప్లై

161
- Advertisement -

భారత మార్కెట్‌లోకి టెస్లా కంపెనీ రావచ్చు అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కానీ ప్రభుత్వ నిబంధనలు షరతులతో వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా కేంద్ర మంత్రి కామెంట్ చేశారు. ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాన్ని భారత్‌లో ప్రారంభిస్తానంటే కచ్చితంగా స్వాగతిస్తామని కేంద్ర మంత్రి  అన్నారు. కానీ, అన్ని భాగాలనూ భారత్‌లోనే తయారు చేయాలని షరతుపెట్టారు. చైనాలోనో లేదంటే వేరే దేశంలోనో తయారు చేసి ఇక్కడ విక్రయిస్తామంటే కుదరదన్నారు. కేంద్ర రాషాలకు పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం చేకూరుస్తున్న రంగమని, దీంట్లో 4కోట్ల మందికి ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

మస్క్‌ భారత్‌లోని ఏ రాష్ట్రంలో తయారీ యూనిట్లను నెలకొల్పినా కేంద్రం సహకరిస్తుందని అన్నారు. అన్ని రాయితీలను కల్పిస్తుందని స్పష్టం చేశారు. భారత్‌లో ఆటోమొబైల్‌ రంగంలో ఏటా 7.5 లక్షల కోట్ల రూపాయల బిజినెస్‌ జరుగుతోందని.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ హబ్‌గా భారత్‌ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఎలక్ట్రిక్‌ కార్లను టెస్లా సంస్థ అమెరికా, చైనా దేశాల్లో ఉత్పత్తి చేస్తోంది. వీటిని భారత్‌లో దిగుమతి చేసి విక్రయించేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. విదేశాల్లో తయారైన కార్లను మాత్రమే భారత్‌లో విక్రయిస్తామని, ఆ తర్వాతే తయారీ యూనిట్‌ను స్థానికంగా నెలకొల్పుతామని ఎలాన్‌ మస్క్‌ గతంలో చెప్పారు. అయితే, మేక్‌-ఇన్‌-ఇండియాకు ప్రాధాన్యత ఇస్తున్న భారత ప్రభుత్వం ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదనలకు అంగీకరించలేదు. దీంతో టెస్లా తన ప్రయత్నాలను తాత్కాలికంగా విరమించుకుంది.

ఇవి కూడా చదవండి…

సంబురాల సంక్రాంతికి 4233బస్సులు….

కారు రేసింగ్…ట్రాఫిక్ ఆంక్షలు

జాబిల్లి టీం రెడీ…

- Advertisement -