గ్రీన్‌ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన కార్పొరేటర్‌

177
- Advertisement -

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా కొనసాగుతుంది. చిన్నాపేద్ద అనే తేడా లేకుండా మొక్కలు నాటి పర్యవరణ పరిరక్షణకు మెము సైతం అంటున్నారు. తాజాగా చర్లపల్లి డివిజన్‌ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్‌ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని చర్లపల్లి సిరి గార్డెన్స్‌లో మొక్కలు నాటారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ…ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఇలాంటి మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమారు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి..

రెండో దశ కంటి వెలుగుకు శ్రీకారం

త్వరలో కృష్ణ మెమోరియల్ ట్రస్ట్‌…

టమోటా తో ఆరోగ్యం….

- Advertisement -