జగన్ డిల్లీ ప్రయాణం..అసలు కారణమదే!

25
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు సర్వత్ర చర్చనీయాంశం అవుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలుకెళ్లడం, పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, ఇక తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిల్లీ ప్రయాణం కావడం.. ఇలా ప్రతి అంశం కూడా హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. కాగా తాజాగా సి‌ఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నపళంగా డిల్లీకి ఎందుకు పయనమైనట్టు అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఇప్పటికిప్పుడు కేంద్ర పెద్దలతో జగన్ భేటీ అవ్వాల్సిన అవసరత ఏముంది అనే దానిపై రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. అయితే అధికార పార్టీ చెబుతున్నా దాని ప్రకారం.. రాష్ట్రనికి రావాల్సిన నిధుల ఇవ్శయమై కేంద్ర పెద్దలతో చర్చించేందుకు వెళ్లడాని చెబుతున్నారు వైసీపీ నేతలు.

కానీ జగన్ డిల్లీ వెళ్లడానికి కారణం వేరే ఉందని ప్రత్యర్థి పార్టీ నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని మరియు స్కామ్ లలో చంద్రబాబు పాత్రను కేంద్ర పెద్దలతో వివరించేందుకు అని కొందరు అభిప్రాయ పడుతూ ఉంటే.. కాదు కాదు ఇంకా ఏదో ఉంది అన్నట్లు ఇతర నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యం జగన్ డిల్లీ ప్రయాణంపై పవన్ చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. ముందస్తు ఎన్నికల విషయంలో కేంద్ర పెద్దలతో చర్చించేందుకే ఆయన డిల్లీ వెళ్లరాని ఇటీవల పవన్ తనదైన రీతిలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణతో పాటే ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతాయని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ముందస్తు ఎన్నికలపై వచ్చే వార్తలన్నిటిని ఖండిస్తూ వచ్చారు ప్రభుత్వ నేతలు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్నా రాజకీయ పరిణామాల దృష్ట్యా అనూహ్యంగా జగన్ డిల్లీకి వెళ్ళడం ఎన్నో సందేహాలకు తావిస్తోంది. మరి జగన్ డిల్లీ టూర్ ముందు రోజుల్లో ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో చూడాలి.

Also Read:‘లియో’.. పవర్ ప్యాక్డ్ ట్రైలర్

- Advertisement -