భూతల్లికి రైతు తెలిపే కృతజ్ఞత సంక్రాంతి..

35
- Advertisement -

దేశ ప్రజలందరికీ యావత్‌ తెలంగాణకు భోగి మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌. పంటపొలాల నుంచి పంట ఇంటికి వచ్చిన సమయమని అన్నారు. నమ్ముకున్న భూతల్లికి రైతు తెలిపే కృతజ్ఞతల రోజే సంక్రాంతి పండుగ అని కేసీఆర్ తెలిపారు. పల్లెలు పచ్చని పంట పొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకోవాలని ఆకాంక్షించారు.

తెలంగాణ వ్యవసాయ రంగం సాధించుకున్న ప్రగతి యావత్‌ దేశాన్నికి మార్గదర్శనంగా నిలుస్తుందన్నారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.2,16,000 కోట్లకుపైగా ఖర్చుచేసిందన్నారు. రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికున్న నిబద్ధతకు ఇది తార్కాణమన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి కోటి 31 లక్షల ఎకరాలు మాత్రమే సాగు విస్తీర్ణం ఉన్నదని, నేడు అది నేడు 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరిగిందని తెలిపారు.

వ్యవసాయాన్ని నమ్ముకుంటే జీవితానికి ఢోకా లేదనే విశ్వాసం తెలంగాణ రైతుల జీవితాల్లో తొణికిసలాడుతోందని వెల్లడించారు. ఇదే విశ్వాసాన్ని దేశ రైతాంగంలో పాదుకొల్పుతామని చెప్పారు. యావత్‌ భారత్‌ ప్రజల సహకారంతో దేశ వ్యవసాయరంగ నమూనాను మార్చి గుణాత్మక అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరముందన్నారు. ప్రజలంతా సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ప్రతి ఇల్లూ సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు.

ఇవి కూడా చదవండి…

మంచి ఆలోచనల పెంపే భోగి…

‘ భోగి ‘ పండుగ ప్రత్యేకత తెలుసా ?

సంక్రాంతి వచ్చింది…పల్లె రమ్మంది

- Advertisement -