గత కొంత కాలంగా బాయ్కట్ ట్రెండ్తో బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బొల్తా పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే షారూఖ్ఖాన్ నటించిన పఠాన్ సినిమాపై కూడా బాయ్కట్ ట్రెండ్ కొనసాగుతుంది. వివాదాస్పదంగా మారిన బేషరం రంగ్ పాటను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమాపై వివాదం చేలరేగింది. దీన్నిపై ప్రముఖులు సినీ రాజకీయ వివిధ మత సంఘాల వ్యతిరేకత వ్యక్తం చేసిన జనవరి 25న విడుదల చేయడానికి షారూఖ్ సిద్ధమవుతున్నారు.
సెన్సార్ బోర్డు ఈ సినిమాపై పలు అభ్యంతకర సన్నివేశాలను తొలగించాల్సిందిగా ఆదేశించించిన సంగతి తెలిసిందే. తాజాగా గుజరాత్ భజరంగ్ దళ్ సంచలన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా పఠాన్ సినిమాపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. సెన్సార్ బోర్డుతో మాకు ఏలాంటి సంబంధం లేదు. ఈ సినిమాని కచ్చితంగా అడ్డుకుని తీరుతామని..సినిమాకు సంబంధించిన పోస్టర్స్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
దేశవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కానున్న నేపథ్యంలో విడుదలపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ట్రైలర్ను రామ్చరణ్ విడుదల చేశారు. దీపికా పడుకొనే హీరోయిన్గా నటిస్తుండగా జాన్ విలన్గా కనిపించనున్నారు. కాగా కండల వీరుడు సల్మాన్ఖాన్ అతిధి పాత్రలో మెరవనున్నారు.
ఇవి కూడా చదవండి…