జియో వినియోగదారులకు శుభవార్త..

204
- Advertisement -

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో త‌న జియో ఫోన్ వినియోగ‌దారుల కోసం రెండు నూత‌న ప్లాన్ల‌ను ఇవాళ ప్ర‌వేశ‌పెట్టింది. రూ.594, రూ.297 దీర్ఘకాల ప్రీపెయిడ్‌ ప్లాన్లను లాంచ్‌ చేసింది. ఈ కొత్త పథకాల ద్వారా జియో ఫోన్‌ వినియోగదారులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించనుంది. రూ 594 పథకం కింద, జియో ఫోన్‌ వినియోగదారులు 168 రోజులు (దాదాపు ఆరు నెలల) అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, అన్‌లిమిటెడ్‌ డేటా లభిస్తుంది.

Reliance Jio

 

అలాగే జియో యాప్స్‌కు ఉచిత యాక్సెస్‌ అందిస్తోంది. అయితే రోజుకు అపరిమిత హై స్పీడ్ డేటా 0.5జీబీ పరిమితి దాటిన తరువాత డేటా స్పీడ్‌ 64కేబీపీఎస్‌కు కు తగ్గుతుందని జియో ప్రకటించింది. అలాగే నెలకు 300 ఎంఎంఎస్‌లు ఉచితం.

ఇక రూ. 297 ప్లాన్‌లో వినియోగదారులు ఉచిత కాలింగ్‌ సదుపాయంతో పాటు నెలకు 300 ఎస్‌ఎంఎస్‌లు, రోజుకు 0.5జీడీ డేటా పొందుతారు. ఈ పరిమితిని దాటినట్లయితే, వేగం 64కేబీపీఎస్‌కు తగ్గుతుంది. ఈ ఆఫర్‌ వాలిడిటీ 84 రోజులు అంటే మొత్తం 3నెలలు వర్తిస్తుంది.

- Advertisement -