ఎయిర్‌టెల్‌కు జియో షాక్‌..

224
- Advertisement -

రిలయన్స్ జియో కొత్తగా ప్లాన్స్‌ను ప్రకటించిన వెంటనే ఇతర టెలికం కంపెనీలు కూడ తమ కొత్త ప్లాన్స్‌ను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌ సరికొత్త ప్లాన్స్‌ను ప్రకటించగా ఉంది. వాటికి దీటుగా తాజాగా జియో కూడా కొత్త ప్లాన్స్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. జియోకు పోటీగా ఎయిర్‌టెల్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు ప్లాన్ల‌కు మార్పులు చేర్పులు చేస్తూ, అద‌న‌పు మొబైల్ డేటాను అందిస్తున్న విష‌యం తెలిసిందే.

Reliance Jio

అయితే ఇప్పుడు మాత్రం జియో వంతు వ‌చ్చింది. ఎయిర్‌టెల్‌కు గ‌ట్టి షాక్ ఇచ్చేలా జియో త‌న వినియోగ‌దారుల‌కు సంచ‌ల‌న ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. దాని ప్ర‌కారం జియో క‌స్ట‌మ‌ర్లంద‌రికీ రోజూ 1.5 జీబీ అద‌న‌పు డేటా ల‌భిస్తుంది. జియోలో రోజువారీ డేటా లిమిట్ ప్లాన్ల‌ను వాడేవారికి ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది.

ఇక జియో ప్ర‌క‌టించిన ఆఫర్ ప్ర‌కారం.. రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్లాన్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రోజుకు 1.5 జీబీ డేటా ల‌భించగా ఇక‌పై రోజుకు 3 జీబీ డేటా ల‌భిస్తుంది. అలాగే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్లాన్ల‌లో క‌స్ట‌మ‌ర్ల‌కు రోజుకు 2 జీబీ డేటా వ‌స్తుండ‌గా ఇక‌పై రోజుకు 3.5 జీబీ డేటా ల‌భిస్తుంది.

Reliance Jio

అదే విధంగా రూ.299 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటాకు బ‌దులుగా 4.5 జీబీ డేటా, రూ.509 ప్లాన్‌లో రోజుకు 4 జీబీ డేటాకు బ‌దులుగా 5.5 జీబీ డేటా, రూ.799 ప్లాన్‌లో రోజుకు 5 జీబీ డేటాకు బ‌దులుగా 6.5 జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ ఆఫ‌ర్ ఈ రోజు సాయంత్రం యాక్టివేట్ కానుండ‌గా ఈ నెల 30వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతుంది. దీంతో ఈ నెల మొత్తం క‌స్ట‌మ‌ర్లు రోజుకు 1.5 జీబీ డేటాను అద‌నంగా పొంద‌వ‌చ్చు.

- Advertisement -