దేశంలో పైలట్ ప్రాజెక్టులు రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. లబ్ధిదారులకు పోషకాలు అందించడంతోపాటు రేషన్ షాప్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపులు కేవలం 8- 9 రోజులు మాత్రమే తెరుస్తున్నారు అన్నారు. మరికొన్ని అయితే మూడు నెలలకు ఒకసారి మాత్రమే పనిచేస్తాయి… మిగిలిన సమయాల్లో ఆ దుకాణాలను మూసేస్తున్నారు అన్నారు. డీలర్లకు ప్రస్తుతం ఉన్న కమీషన్లు సరిపోవట్లేదు. అందుకోసం ప్రత్యామ్నాయ విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భాంగా మేరా రేషన్ యాప్ అప్గ్రేడ్ వెర్షన్ను రిలీజ్ చేశారు. తొలుత ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ ప్రాంతాల్లోని 60 రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చనున్నారు.