BRS:ప్రతీ గ్రామంలో జెండా ఎగరాలి

13
- Advertisement -

ప్రతీ గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలన్నారు మంత్రి కేటీఆర్.ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి సమావేశాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో సర్వసభ్య సమావేశం జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల స్థాయిలో జరుగుతున్నాయి. వాటిని కూడా మే నెలాఖరు వరకు పొడిగించాం. పార్టీ అన్నిరకాలుగా ఎన్నికలతో పాటు అన్ని పోరాటాలకు సన్నద్దంగా ఉండాలని.. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో సంభాషణ జరగాలని ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటుచేశాం. ఇవి చక్కగా జరుగుతున్నాయి. అక్కడక్కడ మా దృష్టికి వచ్చినచిన్న ఇబ్బందులను కరెక్ట్‌ చేసుకుని ముందుకెళ్తాం అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -