సిరిసిల్లకు మంత్రి కేటీఆర్..

24
- Advertisement -

మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పర్యటించనున్నారు. పలు గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.

ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో అంబేద్కర్‌, చాకలి ఐలమ్మ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం అదే గ్రామంలో రూ.19.50 లక్షలతో చేపట్టిన ఎస్సీ , రూ.5 లక్షలతో చేపట్టిన ముదిరాజ్‌ సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

తర్వాత రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం లక్ష్మీపూర్‌లో పల్లె దవాఖానను ప్రారంభిస్తారు. 11.30 గంటలకు పాపయ్యపల్లెలో రూ.26 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు గోపాల్‌రావుపల్లెలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తంగళ్లపల్లిలోని పీహెచ్‌సీలో ఫిజియోథెరపీ సేవలను ప్రారంభిస్తారు. ఒంటిగంటకు మండెపల్లిలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు గండిలచ్చపేటకు చేరుకుంటారు. గ్రామంలో అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిరావుఫూలే విగ్రహాలను ఆవిష్కరిస్తారు. తర్వాత కేసీఆర్‌ ప్రగతి ప్రాంగణాన్ని ప్రారంభించనున్నారు.

దళితబంధు పథకం కింద మంజూరైన పౌల్ట్రీఫాంను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. చిట్టివాగుపై రూ.4 కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -