మావోల విధ్వంసం..జేసీబీ వాహనానికి నిప్పు

10
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ / జార్ఖండ్ సరిహద్దులోని బీజాపూర్‌లో మావోయిస్టులే టార్గెట్‌గా పోలీసులు జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ మధ్యలో నక్సలైట్లు విధ్వంసం సృష్టించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ సరిహద్దులో ఉన్న జార్ఖండ్‌లో విధ్వంసకాండ సృష్టించారు.

రోడ్డు నిర్మాణ పనిలో నిమగ్నమై ఉన్న ఒక గుమస్తాను చంపారు నక్సలైట్లు. అంతేగాదు జేసీబీ వాహనానికి నిప్పు పెట్టారు. మున్షి హత్య తర్వాత ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది ఈ ఘటన.

ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ పోలీసులు సైతం అప్రమత్తంగా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. జార్ఖండ్‌లోని మహువాడనర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓర్సపథ్‌ ఈ ఘటన జరుగగా జార్ఖండ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read:తెలంగాణ వెదర్ అప్‌డేట్!

- Advertisement -