IPL 2023 : ఆర్సీబీ ఓటమి

30
- Advertisement -

ఐపీఎల్ 2023లో భాగంగా కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 17.4 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లి(21), డుప్లెసిస్(23), బ్రేస్ వెల్(19), డేవిడ్ విల్లే(20), ఆకాశ్ దీప్(17) పరుగులు చేశారు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 వికెట్ల పడగొట్టి ఆర్సీబీ పతనాన్ని శాసించాడు. సుయాశ్ శర్మ 3 వికెట్లు, సునీల్ నరైన్ 2 వికెట్లు పడగొట్టారు. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు.

ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ 29 బంతుల్లో 9 ఫోర్లు,3 సిక్స్‌లతో 68 పరుగులు చేయగా రహమానుల్లా 44 బంతుల్లో 57 రన్స్ చేశాడు. అతడి స్కోర్ లో 6 ఫోర్లు, 3 సిక్సలు ఉన్నాయి.

కోల్ కతాకు ఇదే తొలి విజయం కాగా, బెంగళూరుకు తొలి ఓటమి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -