దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ బావమరిది అరెస్ట్..

277
Raghunandan Rao
- Advertisement -

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు స్వయానా బావమరిది సురభి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని బేగంపేటలో రూ.1 కోటి స్వాధీనం చేసుకోగా, ఈ డబ్బును తీసుకెళుతున్న రఘునందన్‌ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు, డ్రైవర్ రవికుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆ డబ్బును తాము దుబ్బాక తీసుకెళుతున్నట్టు సురభి శ్రీనివాసరావు వెల్లడించినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఫోన్ కాల్ లిస్ట్ లో రఘునందన్ రావు కి నేరుగా శ్రీనివాస్ రావు ఫోన్ చేశాడు.

బేగంపేటలోని విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ మేనేజర్ నుంచి ఆ డబ్బును తీసుకుని దుబ్బాక వెళుతున్నట్టు వెల్లడైందని, విశాఖ ఇండస్ట్రీస్ సంస్థ పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కు చెందినదని అంజనీ కుమార్ వివరించారు. ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఇటీవలే సిద్ధిపేటలో రఘునందన్ మామ, ఇతర బంధువుల నివాసాల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు ఎప్పుడూ కృత నిశ్చయంతో వుంటారని సీపీ చెప్పారు.

- Advertisement -