SAMANTHA:చైతు ఎఫైర్ పై సమంత స్పందన

38
- Advertisement -

సమంత – నాగచైతన్య మధ్యలో ఓ శోభిత ధూళిపాళ్ల.. ప్రస్తుతం ఈ ముగ్గురి మీదే సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సమంతతో అక్కినేని నాగచైతన్య విడిపోవడానికి కారణం.. శోభిత ధూళిపాళ్ల అంటూ కొత్తగా గాసిప్ రాయుళ్లు ఓ టాపిక్ ఎత్తుకున్నారు. శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ కోసమే చైతు సామ్ కి దూరం అయ్యాడు అనేది తాజా పుకార్ల సారాంశం. పాపం సమంత బలి అయింది అంటూ కొత్తగా సానుభూతి కూడా చూపిస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. చైతు అనే వ్యక్తి పెద్ద విలన్ అని ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియదు గానీ, ఎన్నో వదంతులు మాత్రం వస్తూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో సమంత ఓ వార్తా సంస్థతో చైతు కొత్త ప్రేమ వ్యవహారం పై స్పందించింది. ‘ఎవరు ఎవరితో అయినా రిలేషన్ షిప్ లో ఉండొచ్చు. ఫలానా వ్యక్తి పక్కన ఎవరు ఉన్నారనేది నేను పట్టించుకోను. కానీ, ఒక్కటి మాత్రం నిజం. ప్రేమ విలువ తెలియని వారికి ఎంత మందితో డేట్ చేసినా, చివరికి మిగిలేది కన్నీరే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. తన ప్రవర్తన మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది’’అని సమంత చైతు గురించి చాలా హుందాగా స్పందించడం విశేషం.

సమంత మాటలను బట్టి.. ఆమె మనసు ఎంతో గాయపడింది అని అర్థం అవుతుంది. ఎన్నో ఏళ్ల స్నేహం, ప్రేమ బంధం తర్వాత నాగచైతన్యను సమంత 2017 అక్టోబర్ లో వివాహం చేసుకుంది. మొదట్లో చాలా ప్రేమగా ఉన్న ఈ జంట, ఆ తర్వాత విడిపోయారు. విడిపోయిన తర్వాత సమంత అనారోగ్యానికి గురి అయ్యారు. అయినా చైతు మాత్రం ఆమెను ఓదార్చి దైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు.

ఇవి కూడా చదవండి…

రెయిన్‌బో..ప్రధాన పాత్రలో రష్మిక

Ugram:మే5న ఉగ్రం విడుదల

Dasara:నైజాంలో దసరా సంబరం.. కానీ,

- Advertisement -