ఆ హాస్యనటి మనసులో మాటలు

55
- Advertisement -

తెలుగు తెరపై హాస్యనటిగా రాణించడం అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటిది సీనియర్ నటి శ్రీలక్ష్మి గారు తెలుగు తెర పై తనదైన ముద్రవేశారు. నవ్వించడమే ప్రధానమైన విలక్షణమైన పాత్రలను పోషించి.. నిన్నటి తరం ప్రేక్షక లోకానికి నవ్వులు పంచారు. ఐతే, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలక్ష్మి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఏ పాత్రకి ఎంత అడగాలనేది కూడా నాకు తెలియదు. డబ్బు ఎగ్గొట్టినవారు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం నా దగ్గరున్న చెల్లని చెక్కులు ఎన్నో’ అంటూ బాధపడుతూ చెప్పారు.

అప్పట్లో నాకు ఇచ్చిందే తక్కువ .. దాని కోసం నేను ఎంతమందిపై కేసులు పెట్టను. అందుకే ఎక్కువ సినిమాలు ఒప్పుకుంటూ వెళ్లాను” అని శ్రీలక్ష్మి చెప్పుకొచ్చారు. అలాగే తన జీవితంలో తనకు ఇష్టమైన వ్యక్తుల గురించి శ్రీలక్ష్మి చెప్పారు. ‘సావిత్రి గారు.. జయసుధ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. సావిత్రిగారితో కలిసి నటించలేకపోయానే అనే బాధ నాకు ఇప్పటికీ ఉంది. అయితే, జయసుధగారితో కలిసి నటించిన ఆనందం మాత్రం నాకు దక్కింది” అని శ్రీలక్ష్మి చెప్పారు.

అలాగే హాస్య నటుల గురించి కూడా శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ‘రాజబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి ఒక సినిమా చేయగలిగాను. ఆయన కూడా అప్పట్లో నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. అది నా అదృష్టంగా భావిస్తుంటాను. ఇక బ్రహ్మానందం గారు, ఎమ్మెస్ నారాయణ గారి కామెడీ కూడా చాలా బాగుంటుంది. బ్రహ్మానందం గారితో ఎక్కువ సినిమాలకు పని చేశాను అని శ్రీలక్ష్మి తెలిపారు.

ఇవి కూడా చదవండి…

రెయిన్‌బో..ప్రధాన పాత్రలో రష్మిక

SAMANTHA:చైతు ఎఫైర్ పై సమంత స్పందన

Ugram:మే5న ఉగ్రం విడుదల

- Advertisement -