మొక్కలు నాటిన ఎమ్మెల్సీ విఠల్‌…

24
- Advertisement -

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దండే విఠల్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్‌కుమార్‌కు పిలుపుమేరకు ఎమ్మెల్సీ తన పుట్టిన రోజున మొక్కలు నాటారు. ఈసందర్భంగా దండె విఠల్ మాట్లాడుతూ… పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్‌ ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

సీఎస్‌కు ధన్యవాదాలు:సంతోష్‌

చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం :సీఎస్

టీఆర్ఎస్‌ఎల్పీ నుండి బీఆర్ఎస్‌ఎల్పీ…

- Advertisement -