- Advertisement -
తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కంగనా రనౌత్..ఈసారి ఇన్స్టాగ్రామ్ పై విరుచుకుపడింది. బాలీవుడ స్టార్ కంగనా రనౌత్ నిత్యం వార్తల్లో నిలిచేందుకు తపిస్తూ ఉంటుంది. గతంలో మహారాష్ట్రలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. బాలీవుడ్లో ఇండస్ట్రీపై పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
తాజాగా ట్విట్టర్ను ఉత్తమ సోషల్ మీడియాగా చెప్పుకొచ్చిన కంగనా… ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మూగది అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఇన్స్టాగ్రామ్ ఒక మూగది. ఇందులో ఫొటోలు తప్ప ఏమీ ఉండవు.
ఎవరైనా ఏదైనా అభిప్రాయం రాసినా అది మరుసటి రోజుకు మాయమైపోతుంది. కొందరు ఉంటారు. వారు చెప్పేదానికి ఎలాంటి అర్థం ఉండదు. వారి సందేశం అదృశ్యమైనా వారేం పట్టించుకోరు. కానీ మాలాంటి వారి పరిస్థితి ఏంటి..? అంటూ ఆమె ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
మరోసారి తెరపైకి సామ్చై…
మెగాఫోన్ పట్టిన నాని సోదరి..
జిమ్లో వర్కవుట్ చేస్తూ మరో నటుడు మృతి..
- Advertisement -