మరోసారి తెరపైకి సామ్‌ – చై…

158
- Advertisement -

పెళ్లి అంటే నూరేళ్ల పంట అటువంటిది కేవలం విడాకుల ద్వారా వీడిపోతున్నారు. సినిమా రంగంలో విడాకులు కేవలం పాప్‌కార్న్‌ తిన్నంత ఈజీ. కానీ తెలుగులో సమంత నాగచైతన్య విడాకుల ప్రకటన కేవలం దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా చాలా మంది బాధపడ్డారు.

ఈ జంట విడాకుల తర్వాత కూడా సినిమాలో బిజీ ఉండి ఎవరిలైఫ్ వారిదే అన్నట్టుగా గడిపారు. కానీ సమంతకు మయోసైటిస్ వ్యాధి కారణంగా ఈ జంట మరోసారి వార్తాల్లో నిలిచింది. అయితే త్వరలోనే నాగార్జున, నాగచైతన్య.. సమంతను కలువబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే విడాకుల తర్వాత సమంత, నాగచైతన్య కలిసి నటించనున్నట్లు టాక్‌.

సమంత నాగచైతన్య తొలిసారిగా కలిసి నటించిన సినిమా ఏమాయ చేశావే. ఆతర్వాత మనం ఆటోనగర్ సూర్య మజిలీ వంటి సినిమాల్లో కలిసి నటించారు. అయితే విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్తతో ఫ్యాన్స్‌ ఖుషీ ఖుషీగా ఏంజాయ్‌ చేస్తున్నారు.

వివాహా బంధానికి స్వస్తీ చెప్పిన వీరిద్దరూ ప్రొఫేషనల్ పరంగా కలిసి నటించడానికి సిద్ధంగా ఉంటామని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇక వీరిద్దరూ మళ్ళీ కలిసిపోవాలని ఎంతో మంది కోరుకుంటున్నారు.

విడాకుల తర్వాత సమంత నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య, వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ‘NC22’ చేస్తున్నాడు. సమంత ఇటీవలే ‘యశోద’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం రిలీజైన ఈ చిత్రం పాజిటీవ్‌ రివ్యూలను తెచ్చుకుని భారీ వసూళ్లు సాధిస్తుంది.

హరి-హరీష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సరోగసి కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. దీనితో పాటుగా గుణశేఖర్‌ ‘శాకుంతలం’లో నటిస్తుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. ఇక విజయ్‌ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ చిత్రాన్ని కూడా చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి..

మెగాఫోన్ పట్టిన నాని సోదరి..

BB6..కెప్టెన్‌గా ఫైమా

స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు..

- Advertisement -